మదర్ డెయిరీ ఉద్యోగుల వేతనాలు పెంపు
ABN , First Publish Date - 2023-06-03T01:09:34+05:30 IST
నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందికి వేతనాలను పెంచామని మదర్ డెయిరీ చైర్మన లిం గాల శ్రీకర్రెడ్డి తెలిపారు.
మదర్ డెయిరీ ఉద్యోగుల వేతనాలు పెంపు
నల్లగొండ, జూన 2: నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందికి వేతనాలను పెంచామని మదర్ డెయిరీ చైర్మన లిం గాల శ్రీకర్రెడ్డి తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని దశల వారీగా న్యాయం చేస్తామన్నారు. ఆఫీస్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.1,507, అసిస్టెంట్లకు రూ.2,777, హెల్పర్లకు 3,012 పెంచినట్లు తెలిపారు. మార్కెట్లో పోటీ నెలకొన్న నేపథ్యంలో సంస్థ అభివృద్ధికి, పాల విక్రయాలపై దృష్టి సారించాలని కోరారు. మదర్ డెయిరీలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం పాలకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తుందన్నారు.