హైదరాబాద్ టూ నాగార్జునసాగర్
ABN , First Publish Date - 2023-06-02T02:31:28+05:30 IST
అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ అందాలను తిలకించేందుకు హైదరాబాద్ వాసులకు పర్యాటకశాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
వారాంతాల్లో విహారయాత్రలకు పర్యాటక శాఖ ఏర్పాట్లు
టికెట్ ధర.. పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.640
నాగార్జునసాగర్, జూన్ 1: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ అందాలను తిలకించేందుకు హైదరాబాద్ వాసులకు పర్యాటకశాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ప్రతీ శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్కు విహారయాత్రలను నిర్వహించనున్నారు. పర్యాటకులను బస్సుల్లో తీసుకువచ్చి లాంచీలో సాగర్ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండ, మ్యూజియం, బుద్ధవనం వంటి వాటిని సందర్శించేలా పర్యాటక శాఖ ఈ యాత్రను సిద్ధం చేసింది. అందుకోసం పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.640గా అధికారులు టికెట్ ధరలను నిర్ణయించారు. నలభై మంది పర్యాటకులు ఉంటే ఈ నెల 3 నుంచే ఈ విహార యాత్రను ప్రారంభిస్తామని పర్యాటక శాఖ ఎండీ మనోహర్ తెలిపారు. పర్యాటక శాఖ వెబ్సైట్ ‘్టౌఠటజీటఝ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ’లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.