Share News

సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:41 AM

సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ

ఇల్లెందు, డిసెంబరు 17: సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరు వరకు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 06:38 AM