నేడు గుట్ట బస్టాండ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-01T00:55:45+05:30 IST

యాదగిరిగుట్ట బస్టాండ్‌ ను మంత్రులు బుధవారం ప్రారంభించనున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా రూ.6కోట్లతో ఆధునిక హంగులతో బస్టాండ్‌ను నిర్మించారు. లక్ష్మీనరసింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు బస్టాండ్‌ నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా మారనుంది.

నేడు గుట్ట బస్టాండ్‌ ప్రారంభం

రూ.6కోట్లతో నిర్మాణం .. ప్రారంభించనున్న మంత్రులు

యాదగిరిగుట్ట రూరల్‌, జనవరి 31: యాదగిరిగుట్ట బస్టాండ్‌ ను మంత్రులు బుధవారం ప్రారంభించనున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా రూ.6కోట్లతో ఆధునిక హంగులతో బస్టాండ్‌ను నిర్మించారు. లక్ష్మీనరసింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు బస్టాండ్‌ నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ప్రారంభోత్సవంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, చైర్మన్‌ జాజిరెడ్డి, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

Updated Date - 2023-02-01T00:55:46+05:30 IST