శాలిగౌరారం ఫీడర్‌ ఛానల్‌కు గండి

ABN , First Publish Date - 2023-05-27T00:52:12+05:30 IST

జిల్లాలో మధ్య తరగతి ప్రాజెక్టులో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు ఫీ డర్‌ ఛానల్‌కు దాదాపు నెల రోజుల క్రితం గండి పడింది. యాదాద్రిభువనగరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ ఆనకట్ట నుంచి శాలిగౌరారం ఫీడర్‌ఛానల్‌కు వచ్చేచో ట సూరారం వద్ద గండి పడింది.

  శాలిగౌరారం ఫీడర్‌ ఛానల్‌కు గండి
గండి పడటంతో మూసీలోకి వెళ్తున్న నీరు

శాలిగౌరారం ఫీడర్‌ ఛానల్‌కు గండి

మూసీలోకి వృథాగా వెళ్తున్న నీరు

పట్టించుకోని ఐబీ అధికారులు

శాలిగౌరారం, మే 27: జిల్లాలో మధ్య తరగతి ప్రాజెక్టులో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు ఫీ డర్‌ ఛానల్‌కు దాదాపు నెల రోజుల క్రితం గండి పడింది. యాదాద్రిభువనగరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ ఆనకట్ట నుంచి శాలిగౌరారం ఫీడర్‌ఛానల్‌కు వచ్చేచో ట సూరారం వద్ద గండి పడింది. ఫీడర్‌ ఛానల్‌లోని నీరంతా ప్రాజెక్టులోకి రా కుండా మూసీ నదిలోకి వృ థాగా వెళ్తుంది. ఫలితంగా శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు రాకపోవడంతో ప్రాజె క్టు ఎండిపోతుంది. దాదాపు నెల రోజుల క్రితం గండిపడినా నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని ఆయక ట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండి పడకుంట ఉన్నట్లయితే ఈ పా టికే శాలిగౌరారం ప్రాజెక్టు నిండి అలుగుపోసే అవకాశం ఉండేదని రైతులు పే ర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి తక్షణమే పడిన గండిని పూడ్చే విధంగా చర్యలు తీసుకుని శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చే విధంగా అ ధికారులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-05-27T00:52:12+05:30 IST