నేటి నుంచి పల్లె వెలుగు టౌన్ బస్ పాస్
ABN , First Publish Date - 2023-07-18T05:08:02+05:30 IST
ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎ్సఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్పా్సకు శ్రీకారం చుట్టింది
నాలుగు జిల్లా కేంద్రాల్లో అమలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎ్సఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్పా్సకు శ్రీకారం చుట్టింది. మొదట కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లెవెలుగు బస్సుల్లో ఈ పాస్ను అమలుచేయాలని నిర్ణయించింది. ఈ టౌన్ పాస్తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్నగర్లలో 10 కిలోమీటర్లు, నిజామాబాద్, నల్లగొండల్లో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయవచ్చని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సోమవారం బస్పాస్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500 చొప్పున చెల్లించి పల్లె వెలుగు టౌన్ బస్పా్సను తీసుకోవచ్చని తెలిపారు. ఈ పాస్ మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో జనరల్ బస్పాస్ అందుబాటులో ఉందన్నారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై ఆర్థికభారం తగ్గ్గించేందుకు పల్లె వెలుగు టౌన్ బస్పాస్ ఉపయోగంగా ఉంటుందన్నారు.