మాల్దీవుల్లో రుతుపవనాల విస్తరణ
ABN , First Publish Date - 2023-06-02T02:34:08+05:30 IST
నైరుతి రుతుపవనాలు గురువారం మాల్టీవులు, కొమరిన్, ఆగ్నేయ, ఆరేబియా సముద్రం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతం ..
4న కేరళలో ప్రవేశం..
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు గురువారం మాల్టీవులు, కొమరిన్, ఆగ్నేయ, ఆరేబియా సముద్రం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు 4న కేరళలో ప్రవేశిస్తాయని వెల్లడించింది. కాగా మరికొందరు నిపుణులు మాత్రం ఈ నెల మూడో తేదీనే కేరళను తాకవచ్చునని అంచనా వేస్తున్నారు.