బీఆర్ఎస్ పాలనలో ఖజానా ఖాళీ: కూనంనేని
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:22 AM
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, వివిధ శాఖల నిధులు ఎటు మళ్లాయో తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
మందమర్రిటౌన్, డిసెంబరు 17: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, వివిధ శాఖల నిధులు ఎటు మళ్లాయో తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్వహించిన ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆరు గ్యారంటీలతోపాటు బీఆర్ఎ్సపై ప్రజలకున్న వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కూనంనేని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ప్రభుత్వంపై భారం పడదన్నారు.