పిల్లిగుండ్ల తండాలో లిప్టు ఏర్పాటుకు కృషి

ABN , First Publish Date - 2023-05-22T01:02:50+05:30 IST

పిల్లిగుండ్ల తం డాలో లిప్టు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తాన ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని దుగ్యాల గ్రామ పంచాయతీలో రూ.65 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆ యన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

   పిల్లిగుండ్ల తండాలో లిప్టు ఏర్పాటుకు కృషి
పిల్లిగుండ్లతండాలో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

పిల్లిగుండ్ల తండాలో లిప్టు ఏర్పాటుకు కృషి

ఎమ్మెల్యే రవీంద్ర

పెద్దఅడిశర్లపల్లి, మే 21: పిల్లిగుండ్ల తం డాలో లిప్టు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తాన ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని దుగ్యాల గ్రామ పంచాయతీలో రూ.65 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆ యన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రం లో అన్ని వర్గాలకు మంచి చేసేందుకు ప్రభుత్వం పథకాలు రూపొందించి అమ లు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాషా్ట్రలకు ఆదర్శంగా మారాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వం గాల ప్రతాప్‌రెడ్డి, సర్పంచ నర్రావుల జయమ్మలచ్చిరెడ్డి, ఎంపీడీవో మోహనరెడ్డి, ఎంఈవో రాములు, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన ఏడుకొండలు యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి పరమేష్‌యాదవ్‌, కల్లూరి శ్రీనివా్‌సరెడ్డి, శేఖర్‌రెడ్డి, వెంకటయ్య, నర్సింహ, యాదగిరి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-22T01:02:50+05:30 IST