Share News

తనిఖీల్లో రూ.40లక్షలు స్వాధీనం

ABN , First Publish Date - 2023-11-21T23:55:26+05:30 IST

ఎన్నికల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం ఇద్దరు వ్యక్తులు రూ.40లక్షల నగదును తీసుకె ళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

 తనిఖీల్లో రూ.40లక్షలు స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు

తాండూరు, నవంబరు 21: ఎన్నికల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం ఇద్దరు వ్యక్తులు రూ.40లక్షల నగదును తీసుకె ళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. పెద్దేముల్‌ మండలం మారేపల్లి సమీపంలోని ఓ కాటన్‌మిల్లు నుంచి యువకులు వినయ్‌, వీరారెడ్డిలు నగదును తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు రాజేందర్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ డబ్బులను స్ర్కీనింగ్‌ కమిటీకి అప్పగించామని తెలిపారు.

Updated Date - 2023-11-21T23:55:27+05:30 IST