ధనుర్మాస పూజలు ప్రారంభం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:07 PM
గోదాదేవికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస పూజలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఎదులాబాద్ గోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్తలు ధనుర్మాసం సందర్భంగా తెల్లవారు జామునే ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఘట్కేసర్ రూరల్, డిసెంబరు 17: గోదాదేవికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస పూజలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఎదులాబాద్ గోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్తలు ధనుర్మాసం సందర్భంగా తెల్లవారు జామునే ప్రత్యేకపూజలు నిర్వహించారు. సేవాకాలం, స్వామివారికి తిరుప్పావై ఆలకించారు. గోవింద నామస్మరణతో ఆలయప్రాగంణం మారుమ్రోగింది. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణి చేశారు. ముది రాజ్సంఘం నాయకుడు జవ్వాజీ లింగం ముదిరాజ్, ఆలయధర్మకర్తలు ప్రతిరోజు దేవాలయానికి వచ్చే వందమంది భక్తులను సత్కరించారు. ఈ ఆలయ ధర్మకర్తలు టీపీ లక్ష్మణాచార్యులు, గోవిందాచార్యు లు, అచ్యుతాచార్యులు, అధిత్యచార్యులు తదితరులు పాల్గొన్నారు.