రేపటి నుంచి సాగర్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు

ABN , First Publish Date - 2023-09-04T01:12:47+05:30 IST

నల్లగొండ జిల్లా నా గార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని హిల్‌కాలనీలో రెండు రో జుల పాటు సీడబ్య్లూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన) సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డీఈ పరమేష్‌ తెలి పారు.

 రేపటి నుంచి సాగర్‌లో  సీడబ్ల్యూసీ సమావేశాలు

రేపటి నుంచి సాగర్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు

రెండు రోజుల పాటు నిర్వహణ

బీసీ గురుకుల పాఠశాలలో కార్యక్రమాలు

నాగార్జునసాగర్‌, సెప్టెంబరు 3: నల్లగొండ జిల్లా నా గార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని హిల్‌కాలనీలో రెండు రో జుల పాటు సీడబ్య్లూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన) సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డీఈ పరమేష్‌ తెలి పారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్‌’లో భాగంగా సీడబ్ల్యూసీ సమావేశాలు ఈ నెల 5, 6 తేదీల్లో సాగర్‌ హిల్‌కాలనీలోని బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ తేదీన నీటి అవసరాలు, లభ్యత, స్టోరేజీ వం టి అంశాలపై పెయింటింగ్‌ పోటీలు నిర్వహిస్తామని, 6వ తేదీన సాగర్‌ కాలనీల్లో నీటి అవసరాలను, తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. ఈ సమావేశాలకు చెన్నై నుంచి సీడబ్య్లూసీ పీడీ రాజమణి, సీఈ రంగారెడ్డి, ఈఎనసీ ఎస్‌ఈ రమే్‌షకుమార్‌, ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్‌, ఎస్‌ఈ నాగేశ్వర్‌రావు, ఈఈ మల్లికార్జున, డీఈఈ పరమేష్‌, సుదర్శన, ఇతర ప్రాజెక్టు ఇంజనీర్లు పాల్గొంటారని తెలిపారు.

Updated Date - 2023-09-04T01:12:47+05:30 IST