Share News

పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ: ఈటల

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:55 AM

ప్రజలకు సేవా చేయాలన్న సంకల్పం బలంగా ఉందని.. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ: ఈటల

మౌలాలి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవా చేయాలన్న సంకల్పం బలంగా ఉందని.. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మౌలాలి డివిజన్‌ ఆర్కేహెచ్‌ కాలనీలోని అష్ట లక్ష్మీ దేవాలయంలో ఆదివారం ఈటల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, అభిమానులు, బీజేపీ నాయకులు.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఈటలను కోరారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 02:55 AM