రేపు సీఎం ప్రజా ఆశీర్వాద సభ
ABN , First Publish Date - 2023-11-20T23:42:04+05:30 IST
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోస్గిలో నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

ఏర్పాట్లును పరిశీలించిన మంత్రి మహేందర్రెడ్డి
కొడంగల్, నవంబరు 20: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోస్గిలో నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. సభ విజయవంతానికి భారీ సంఖ్యలో నాయకుల, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని కోరారు. కా గా సీఎం సభా ఏర్పాట్లను సోమవారం సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, పరిశీలకులు కార్పోరేటర్ బాబాఫసీయోద్దీన్ తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.