CM Revanth Reddy: దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలకు ఆదేశం
ABN , Publish Date - Dec 30 , 2023 | 01:16 PM
ప్రజాపాలన దరఖాస్తులపై అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: ప్రజాపాలన దరఖాస్తులపై అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనన్నారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాత లబ్దిదారులందరికీ యథాతథంగా లబ్ది చేకూరుతుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.