MLA Sayanna: సాయన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్

ABN , First Publish Date - 2023-02-19T19:14:00+05:30 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(MLA Sayanna)కు సీఎం కేసీఆర్ (CM KCR) నివాళి అర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.

MLA Sayanna: సాయన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(MLA Sayanna)కు సీఎం కేసీఆర్ (CM KCR) నివాళి అర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. సాయన్న ఆకస్మిక మరణం బాధాకరమన్నారు. ఆయన వివిధ పదవులతో నిస్వార్థ సేవలందించారని కేసీఆర్ కొనియాడారు. సాయన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయన్న మృతికి మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి (KTR Mallareddy), తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. సాయన్న మృతి బీఆర్‌ఎస్‌ (BRS)కు తీరని లోటని, కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని మల్లారెడ్డి గుర్తుచేశారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న... యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. షుగర్‌ లెవల్‌ పడిపోవడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. సాయన్న1951 మార్చి 5న జన్మించారు. టీడీపీ (TDP)లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచలుగా ఎదుగుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999, 2004, 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2015లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2018లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Updated Date - 2023-02-19T19:15:17+05:30 IST