జేఈఈ అడ్వాన్డ్స్ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో భాష్యం రామకృష్ణ
ABN , First Publish Date - 2023-06-19T03:43:31+05:30 IST
జేఈఈ అడ్వాన్డ్స్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు టాప్ టెన్లో రెండు ర్యాంకులు సాధించారు.
భాష్యం జేఈఈ అకాడమీ జయకేతనం
గుంటూరు(విద్య), జూన్ 18 : జేఈఈ అడ్వాన్డ్స్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు టాప్ టెన్లో రెండు ర్యాంకులు సాధించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఏవీ శివరామ్ 5వ ర్యాంకు, వైవీ మణీందర్రెడ్డి 10వ ర్యాంకు సాధించారు. 50లోపు 11 ర్యాంకులు, 100లోపు 16 ర్యాంకులు, 200లోపు 23 ర్యాంకులు, వెయ్యిలోపు 59 ర్యాంకులు, 2వేల లోపు 99 ర్యాంకులు, 5వేల లోపు 181 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు తదితరులు అభినందించారు.