రామనామస్మరణతో మార్మోగిన బైంసా
ABN , First Publish Date - 2023-03-31T02:52:24+05:30 IST
శ్రీరామనవమి పర్వదినాన నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణం రామనామస్మరణతో మార్మోగిపోయింది.
భైంసా/ముప్కాల్: శ్రీరామనవమి పర్వదినాన నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణం రామనామస్మరణతో మార్మోగిపోయింది. హిందూవాహిని ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శోభాయాత్ర ఘనంగా సాగింది. భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, హిందూవాహిని, బీజేపీ, కాంగ్రెస్, ఆర్ఎ్సఎస్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు శ్రీరాముడు, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక గోశాల వద్ద ఉదయం పది గంటలకు మొదలైన యాత్ర సాయంత్రం 6గంటలకు రాంలీలా మైదానానికి చేరుకోవడంతో ప్రశాంతంగా ముగిసింది.