ఎన్టీఆర్‌ హయాంలోనే ఆసరా పింఛన్లు

ABN , First Publish Date - 2023-03-26T00:25:47+05:30 IST

మా జీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు హ యాంలోనే ఆ సరా పింఛన్లను ప్రారంభించారని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ఎల్‌వీయాదవ్‌ అ న్నారు.

 ఎన్టీఆర్‌ హయాంలోనే ఆసరా పింఛన్లు
సభ్యత్వ నమోదులో పాల్గొన్న నాయకులు

ఎన్టీఆర్‌ హయాంలోనే ఆసరా పింఛన్లు

నల్లగొండ, మార్చి 25: మా జీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు హ యాంలోనే ఆ సరా పింఛన్లను ప్రారంభించారని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ఎల్‌వీయాదవ్‌ అ న్నారు. ఇంటింటికీ తెలుగుదేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగం గా పట్టణంలోని 27, 28వార్డుల్లో పర్యటించారు. సంతోషిమాత ఆలయం లో పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు హయాంలోనే కులవృత్తుల వారికి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థిక బలోపేతానికి కృషి చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కులవృత్తులన్నీ మం టకలిసి పోతున్నాయని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల విజయ్‌కుమార్‌, గుండు వెంకటేశ్వర్లు, గోగు నాగరాజు, కొండేటి దయాకర్‌, గంగాధర్‌, స్వరాజ్‌, కంచనపల్లి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:25:47+05:30 IST