తెలంగాణ కాంగ్రెస్ పరిశీలకులుగా దీపా దాస్ మున్షి, ప్రసాద్ నియామకం
ABN , First Publish Date - 2023-08-01T03:07:32+05:30 IST
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆయా రాష్ట్రాలకు పరిశీలకులను నియమించింది.
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆయా రాష్ట్రాలకు పరిశీలకులను నియమించింది. తెలంగాణకు సీనియర్ పరిశీలకురాలిగా మాజీ ఎంపీ దీపా దాస్ మున్షి, పరిశీలకుడిగా సిరివెల్ల ప్రసాద్ను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన దీపా దాస్ మున్షి కేంద్ర మాజీ మంత్రి ప్రియ రంజన్ దాస్ మున్షి సతీమణి. 2012 నుంచి 2014 వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. మరో పరిశీలకుడిగా నియమితులైన సిరివెల్ల ప్రసాద్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు.