మరో 13 మందిపై శాశ్వత వేటు
ABN , First Publish Date - 2023-06-01T03:40:01+05:30 IST
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇటీవల 37 మందిపై శాశ్వత వేటు(డిబార్) వేసిన టీఎ్సపీఎస్సీ.. బుధవారం మరో 13 మందిపై చర్యలు తీసుకుంది.
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇటీవల 37 మందిపై శాశ్వత వేటు(డిబార్) వేసిన టీఎ్సపీఎస్సీ.. బుధవారం మరో 13 మందిపై చర్యలు తీసుకుంది. హైటెక్ మాస్ కాపీయింగ్, లీకేజీతో సంబంధం ఉన్న 13 మందిని డిబార్ చేసింది. వారు రెండు రోజుల్లో వివరణ ఇచ్చుకోవాలని టీఎ్సపీఎస్సీ ఆదేశించింది. ఒకవేళ వారు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుంటే.. డిబార్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. తాజాగా డిబార్ అయిన వారిలో పూల రవికిశోర్, రాయపుర విక్రమ్, రాయపురం దివ్య, ధనావత భరత నాయక్, పసికంటి రోహితకుమార్, గాదె మధు, లోకిని సతీశ కుమార్, బొడ్డుపల్లి నర్సింగ్రావు, గుగులోత శ్రీనునాయక్, భుక్యా మహేశ, ముదావత ప్రశాంత, వదిత్య నరేశ, పూల రమేశ కుమార్లు ఉన్నారు. దీంతో.. ఇప్పటి వరకు డిబార్ అయిన అభ్యర్థుల సంఖ్య 50కి చేరుకుంది