పోలవరం కేసును 3నెలలు వాయిదా వేయండి
ABN , First Publish Date - 2023-03-26T02:27:40+05:30 IST
పోలవరం బ్యాక్వాటర్ ముంపుపై ఒడిసా, ఛత్తీ్సగఢ్, తెలంగాణ వేసిన కేసు విచారణను మూడునెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు కేంద్రం శనివారం లేఖ రాసింది.
సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు కేంద్రం లేఖ
పోలవరం బ్యాక్వాటర్ ముంపుపై ఒడిసా, ఛత్తీ్సగఢ్, తెలంగాణ వేసిన కేసు విచారణను మూడునెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు కేంద్రం శనివారం లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ, ఒడిసా, తెలంగాణ, ఛత్తీ్సగఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సమావేశం జరపాల్సి ఉంది. ఈ నెల 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరగనున్న నేపథ్యంలో మూడునెలలు సమయం ఇస్తే ఆ లోపు సీఎంల సమావేశం నిర్వహించి, ఆ తదుపరి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని కేంద్రం లేఖలో స్పష్టం చేసింది.