కిక్కిరిసిన బస్సు
ABN , First Publish Date - 2023-12-10T22:41:18+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్నాయి. కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం మహిళలు బస్సుల్లో ఎక్కేందుకు పోటీ పడ్డారు.
కొడంగల్ రూరల్, డిసెంబరు 10: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్నాయి. కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం మహిళలు బస్సుల్లో ఎక్కేందుకు పోటీ పడ్డారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషదాయకమని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.