Share News

TS Polls: ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-11-30T15:17:05+05:30 IST

ఎన్నికల నిబంధనలు అతిక్రమించారనే ఫిర్యాదుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు.

TS Polls: ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే?

నిర్మల్: ఎన్నికల నిబంధనలు అతిక్రమించారనే ఫిర్యాదుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఎల్లపెల్లి(Ellapelli)లో పార్టీ కండువా వేసుకుని ఇంద్రకరణ్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కండువాతోనే ఓటు వేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రతిపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈనెల 28న ప్రచారం ముగిసింది. పార్టీ గుర్తులు కనిపించేలా చేయటం, ఫలనా గుర్తుకు ఓటు వేయాలని చెప్పటం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆ నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ కేంద్రానికి ఆయన సింబల్‌తో కూడిన పార్టీ కండువా వేసుకుని వెళ్లటం గమనార్హం. ఆయన తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2023-11-30T15:20:43+05:30 IST