నా 34 ఏళ్ల సర్వీసులో ఇంతటి అభివృద్ధిని ఎప్పుడూ చూడలేదు: సీఎస్
ABN , First Publish Date - 2023-06-11T03:33:19+05:30 IST
తన 34 ఏళ్ల సర్వీసులో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎస్ శాంతికుమారి అన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి అంకిత
తన 34 ఏళ్ల సర్వీసులో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎస్ శాంతికుమారి అన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి అంకిత భావంతో పని చేయడమే ఈ అభివృద్ధికి కారణమని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తొమ్మిదేళ్లలో దేశంలో మరే రాష్ట్రం సాధించని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎంసీహెచ్ఆర్డీలో సుపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ వంటి రంగాల్లో రికార్డు స్థాయిలో పురోగతి నమోదైందన్నారు.