నాలుగో టెస్టుకు ఇద్దరు ప్రధానులు!
ABN , First Publish Date - 2023-03-05T00:28:20+05:30 IST
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆసీస్ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ హాజరయ్యే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆసీస్ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈనెల 9 నుంచి మ్యాచ్ జరుగబోతోంది. అయితే ఆసీస్ ప్రధాని భారత పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.