విజయం దిశగా ‘రెస్ట్‌’

ABN , First Publish Date - 2023-03-05T00:24:21+05:30 IST

తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్‌ యశస్వీ జైస్వాల్‌..రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం (144)తో దుమ్మురేపాడు.

విజయం దిశగా ‘రెస్ట్‌’

గ్వాలియర్‌: తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్‌ యశస్వీ జైస్వాల్‌..రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం (144)తో దుమ్మురేపాడు. దాంతో రంజీ చాంపియన్స్‌ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా విజయం దిశగా మరో అడుగువేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 85/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన రెస్ట్‌ 246 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 437 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన మధ్యప్రదేశ్‌ నాలుగో రోజు ఆఖరికి 81/2 స్కోరు చేసింది. విజయానికి చివరి రోజు ఆ జట్టు మరో 356 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ 484, ఎంపీ 294 రన్స్‌ చేశాయి.

Updated Date - 2023-03-05T00:24:21+05:30 IST