దబాంగ్ ఢిల్లీకి శ్రీజ
ABN , First Publish Date - 2023-06-03T00:56:14+05:30 IST
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) సీజన్-4కు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఇక్కడ జరిగింది.
పుణెరి పల్టన్కు స్నేహిత్
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) సీజన్-4కు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఇక్కడ జరిగింది. ఈమేరకు ఆరు జట్లు తమ ప్యాడ్లర్లను ఎంపిక చేసుకున్నాయి. మొత్తం 40 మంది ఆటగాళ్లు డ్రాఫ్ట్కు అందుబాటులో ఉండగా..ఆయా జట్లు 36 మందిని తీసుకున్నాయి. స్టార్లు శరత్ కమల్ (చెన్నై లయన్స్), సాథియన్ (దబాంగ్ ఢిల్లీ టీటీసీ), మనికా బాత్రా (బెంగళూరు స్మాషర్స్), మానవ్ ఠక్కర్ (యూ ముంబా టీటీ)ను ఆయా జట్లు రిటైన్ చేసుకున్నాయి. ఇక..తెలంగాణ ప్యాడ్లర్లలో కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత ఆకుల శ్రీజను దబాంగ్ ఢిల్లీ తీసుకోగా, స్నేహిత్ను పుణెరి పల్టన్ టీటీసీ ఎంపిక చేసుకుంది. తాజా సీజన్ జూలై 13 నుంచి 30 వరకు పుణెలో జరగనుంది.