క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2023-03-31T02:55:39+05:30 IST

స్పెయిన్‌ మాస్టర్స్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్‌లో సింధు 21-14, 21-16తో కుసుమవర్దని

క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్‌

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్‌లో సింధు 21-14, 21-16తో కుసుమవర్దని (ఇండోనేసియా)పై అలవోకగా నెగ్గింది. సింధు.. క్వార్టర్స్‌లో డెన్మార్‌ ప్లేయర్‌ బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. ఇక సాయి ప్రణీత్‌పై కిడాంబి శ్రీకాంత్‌ 21-15, 21-12తో గెలవగా.. సమీర్‌ వర్మ 15-21, 14-21తో సునెయామా (జపాన్‌) చేతిలో ఓడాడు. డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ కపిల అలాగే సిక్కిరెడ్డి-ఆర్తి జోడీ ఓటమి చవి చూశారు. కాగా సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌, అస్మిత, రజావత్‌, కిరణ్‌ కూడా పరాజయం పాలయ్యారు.

Updated Date - 2023-03-31T02:55:39+05:30 IST