ఆ ఇద్దరి ఎంపికపై ఐవోఏ ఆఫీసు ముందు నిరసన
ABN , First Publish Date - 2023-07-21T03:47:59+05:30 IST
రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజ్రంగ్ పూనియాలకు ఆసియాడ్ ట్రయల్స్ నుంచి మినహాయింపునివ్వడంపై అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో కొందరు జూనియర్ రెజ్లర్లు, వారి తల్లిదండ్రులు, బంధువులు సుమారు 100 మంది
న్యూఢిల్లీ: రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజ్రంగ్ పూనియాలకు ఆసియాడ్ ట్రయల్స్ నుంచి మినహాయింపునివ్వడంపై అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో కొందరు జూనియర్ రెజ్లర్లు, వారి తల్లిదండ్రులు, బంధువులు సుమారు 100 మంది గురువారం భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఫొగట్, పూనియాలకు నేరుగా ఆసియాడ్ బెర్త్లు కేటాయిస్తూ అడ్హాక్ ప్యానల్ తీసుకొన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ట్రయల్స్ నుంచి మినహాయింపు ప్రతిపాదనను తాను తిరస్కరించినట్టు సాక్షి మాలిక్ ట్వీట్ చేసింది. మరోవైపు రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ (66)కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.