స్మిత్, కోహ్లీలను కట్టడి చేస్తేనే..: ఫించ్
ABN , First Publish Date - 2023-06-02T04:03:32+05:30 IST
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్, భారత్ నుంచి విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తారని మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ ఇద్దరూ నాలుగో నెంబర్లోనే బరిలోకి దిగుతారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్, భారత్ నుంచి విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తారని మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ ఇద్దరూ నాలుగో నెంబర్లోనే బరిలోకి దిగుతారు. వీరిని ఇరు జట్ల బౌలర్లు కూడా వీలైనంత త్వరగా అవుట్ చేయడం అవసరం. ఓవల్లో స్మిత్కు అద్భుత రికార్డు ఉంది. ఏదిఏమైనా ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగడం ఖాయం’ అని ఫించ్ అన్నా డు. మరోవైపు ఆసీస్ జట్టు చటేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీలపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. ము ఖ్యంగా కౌంటీల్లో ససెక్స్ తరఫున విశేషంగా రాణించాడని, ఇక కోహ్లీ సైతం ఐపీఎల్లో రెండు శతకాలు, ఆరు అర్ధసెంచరీలతో టచ్లో ఉ న్నాడని గుర్తుచేశాడు. ఈ ఇద్దరి కట్టడికి చక్కటి ప్రణాళికలతో ఆసీస్ బరిలోకి దిగాల్సి ఉంటుందని పాంటింగ్ తెలిపాడు.