భారత్‌కు తొమ్మిదో స్థానం

ABN , First Publish Date - 2023-01-29T00:50:33+05:30 IST

ప్రపంచ కప్‌ను భారత్‌ ఘన విజయంతో ముగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో మనోళ్లు 5-2తో సౌతాఫ్రికాపై గెలుపొంది తొమ్మిదో స్థానంలో నిలిచారు. అభిషేక్‌ (4), హర్మన్‌ప్రీత్‌సింగ్‌ (11), శంషేర్‌

భారత్‌కు తొమ్మిదో స్థానం

- దక్షిణాఫ్రికాపై 5-2తో విజయం

- హాకీ ప్రపంచ కప్‌

రూర్కెలా: ప్రపంచ కప్‌ను భారత్‌ ఘన విజయంతో ముగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో మనోళ్లు 5-2తో సౌతాఫ్రికాపై గెలుపొంది తొమ్మిదో స్థానంలో నిలిచారు. అభిషేక్‌ (4), హర్మన్‌ప్రీత్‌సింగ్‌ (11), శంషేర్‌ సింగ్‌ (44), ఆకాశ్‌దీ్‌ప సింగ్‌ (48), సుఖ్‌జీత్‌ సింగ్‌ (58) భారత్‌ తరపున గోల్స్‌ చేశారు. సామ్‌కెలో (48), కాసిమో (59) సౌతాఫ్రికాకు గోల్స్‌ అందించారు. సౌతాఫ్రికా 11వ స్థానంలో నిలిచింది. వేల్స్‌పై 6-0తో నెగ్గిన అర్జెంటీనా కూడా తొమ్మిదో స్థానం సాధించింది. చిలీపై 4-0తో నెగ్గిన ఫ్రాన్స్‌, జపాన్‌ను 3-2తో ఓడించిన మలేసియా జట్లు సంయుక్తంగా 13వ స్థానం దక్కించుకున్నాయి. వేల్స్‌ 11వ, జపాన్‌, చిలీకి 15వ స్థానాలు లభించాయి.

Updated Date - 2023-01-29T00:50:43+05:30 IST