తుది దశ మ్యాచ్లకు ఉడ్ దూరం
ABN , First Publish Date - 2023-04-26T01:30:55+05:30 IST
లఖ్నవూ పేసర్ మార్క్ ఉడ్ ఐపీఎల్ తుది దశ మ్యాచ్లకు దూరం కానున్నాడు.
న్యూఢిల్లీ: లఖ్నవూ పేసర్ మార్క్ ఉడ్ ఐపీఎల్ తుది దశ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఉడ్ భార్య సారా వచ్చేనెల చివరి వారంలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో ఉడ్ స్వదేశం ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. అలాగే జూన్ ఒకటి నుంచి లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో ఇంగ్లండ్ ఏకైక టెస్టు ఆడనుంది. దీంతో చెన్నై ఆటగాడు, బెన్ స్టోక్స్ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశముంది.