సెమీస్లో లక్ష్యసేన్
ABN , First Publish Date - 2023-06-03T00:58:34+05:30 IST
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 సిరీస్ టోర్నీ సెమీ్సకు దూసుకుపోయాడు.
కిరణ్ జోరుకు బ్రేక్
థాయ్లాండ్ ఓపెన్
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 సిరీస్ టోర్నీ సెమీ్సకు దూసుకుపోయాడు. అయితే మేటి ఆటగాళ్లను ఓడిస్తూ వస్తున్న మరో యువ ఆటగాడు కిరణ్ జార్జ్ జోరుకు క్వార్టర్ఫైనల్లో బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో లక్ష్యసేన్ 21-19, 21-11 స్కోరుతో మలేసియాకు చెందిన లియోంగ్ జున్ హావోని చిత్తు చేశాడు. ఈ సీజన్లో సేన్ తొలిసారి ఓ టోర్నమెంట్లో సెమీ్సదాకా చేరాడు. తదుపరి రౌండ్లో రెండో సీడ్ థాయ్ షట్లర్ కున్లవత్ వితిద్శరణ్తో సేన్ అమీతుమీ తేల్చుకుంటాడు. మరో క్వార్టర్స్లో కున్లవత్ 18-21, 21-14, 21-11 స్కోరుతో ఐదో సీడ్ లు గ్వాంగ్ జు (చైనా)పై నెగ్గాడు. పురుషుల సింగిల్స్లో ఇంకో క్వార్టర్స్ పోరులో కిరణ్ జార్జ్ 16-21, 17-21 స్కోరుతో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.