మూడో వన్డేలో కివీస్ చిత్తు
ABN , Publish Date - Dec 24 , 2023 | 03:20 AM
పేసర్లు తన్జిమ్ (3/14), సౌమ్య సర్కార్ (3/18), షోరిఫుల్ (3/22) చెలరేగడంతో బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ చిత్తయింది...
నేపియర్: పేసర్లు తన్జిమ్ (3/14), సౌమ్య సర్కార్ (3/18), షోరిఫుల్ (3/22) చెలరేగడంతో బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ చిత్తయింది. తొలుత కివీస్.. 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాపై న్యూజిలాండ్కిది అత్యల్ప స్కోరు. అనంతరం బంగ్లా లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో 99/1 స్కోరుతో ఛేదించింది. షంటో (51 నాటౌట్) టాప్స్కోరర్. తద్వారా న్యూజిలాండ్ గడ్డపై మొదటి వన్డేలో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను ఆతిథ్య జట్టు 2-1తో నెగ్గింది.