IPL -2023: చెపాక్లో మ్యాచ్ టిక్కెట్ల కోసం క్యూ కట్టిన CSK అభిమానులు
ABN , First Publish Date - 2023-03-27T21:46:06+05:30 IST
16వ ఐపీఎల్(IPL) సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఏప్రిల్ 3న తొలి మ్యాచ్ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) సొంత గడ్డపై లక్నో జెయింట్స్తో తలపడబోతోంది.
చెన్నై: ఐపీఎల్(IPL) 16వ సీజన్ మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఏప్రిల్ 3న తొలి మ్యాచ్ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) సొంత గడ్డపై లక్నో జెయింట్స్తో తలపడ బోతోంది. ఈ సీజన్లో ఎంఎస్ ధోనీ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో 7 మ్యాచ్లు ఆడుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు టికెట్ కోసం ఎగబడ్డారు. సోమవారం టికెట్ల కోసం స్టేడియం వద్ద అభిమానులు బారులు తీశారు. క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి మరీ టికెట్లు కొనుగోలు చేశారు.
గత ఐపీఎల్ సీజన్లో చిదంబరం స్టేడియం అభిమానులతో కిటకిటలాడింది. ఈ ఏడాది కూడా చిదంబరం స్టేడియం అభిమానులతో కిక్కిరిసి పోయేలా కనిపిస్తోంది. ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో జెయింట్స్ మధ్య మ్యాచ్కోసం టికెట్ కౌంటర్ల వద్ద సీఎస్కే ఫ్యాన్స్ క్యూకట్టారు. ఎంట్రీ పాస్లకోసం గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.