మీరు ఎందరికో ప్రేరణ

ABN , First Publish Date - 2023-02-02T00:50:07+05:30 IST

అభిమానులతో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత అండర్‌-19 మహిళల జట్టుకు బుధవారం ఘన సన్మానం జరిగింది.

మీరు ఎందరికో  ప్రేరణ

అభిమానులతో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత అండర్‌-19 మహిళల జట్టుకు బుధవారం ఘన సన్మానం జరిగింది. ఇటీవలి టీ20 వరల్డ్‌ కప్‌లో ఈ జట్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ‘మెగా టోర్నీ గెలుచుకోవడం ద్వారా భారత్‌లోని అమ్మాయిలకు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలనే ప్రేరణను కలిగించారు. ఇక రాబోయే మహిళల ఐపీఎల్‌ అత్యంత విజయవంతమయ్యే అవకాశం ఉంది. కేవలం క్రీడల్లోనే కాకుండా ఏ రంగంలోనైనా పురుషులు, మహిళల మధ్య సమానత్వం ఉండాలని నేను కోరుకుంటాను’ అని ముఖ్య అతిఽథిగా పాల్గొన్న సచిన్‌ తెలిపాడు. అనంతరం బీసీసీఐ ప్రకటించిన రూ. 5 కోట్ల చెక్‌ను కెప్టెన్‌ షఫాలీ వర్మకు అందించారు. సచిన్‌తో పాటు బోర్డు అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, రాజీవ్‌ శుక్లా, జైషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:50:08+05:30 IST