Share News

ఇంగ్లండ్‌-ఎతో భారత్‌ పోరు

ABN , First Publish Date - 2023-11-29T05:26:42+05:30 IST

భారత్‌-ఎతో ఇంగ్లండ్‌-ఎ మూడు టీ20ల సిరీస్‌ ముంబై వేదికగా బుధవారం ప్రారంభమవనుంది. ఇండియా-ఎ మహిళల జట్టులోని ప్రతిభావంతులకు తమ సత్తా నిరూపించుకోవడానికి

ఇంగ్లండ్‌-ఎతో భారత్‌ పోరు

ముంబై: భారత్‌-ఎతో ఇంగ్లండ్‌-ఎ మూడు టీ20ల సిరీస్‌ ముంబై వేదికగా బుధవారం ప్రారంభమవనుంది. ఇండియా-ఎ మహిళల జట్టులోని ప్రతిభావంతులకు తమ సత్తా నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఇండియా-ఎ జట్టులో తెలుగు క్రికెటర్లు త్రిష, అనూష కూడా ఉన్నారు. కేరళ క్రికెటర్‌ మిన్ను మణి నడిపించనుంది. రెండో టీ20 డిసెంబరు 1, మూడో టీ20 డిసెంబరు 3వ తేదీన జరగనున్నాయి. ఇక, వాంఖడేలో జరగనున్న ఈ మ్యాచ్‌లన్నింటికి అభిమానులను ఉచితంగా స్టేడియంలోకి అనుమతించనున్నట్టు ముంబై క్రికెట్‌ సంఘం తెలిపింది.నేటి నుంచి మహిళల టీ20 సిరీస్‌

Updated Date - 2023-11-29T05:26:44+05:30 IST