హార్దిక్ పాండ్యాను రూ. 100 కోట్లకు అమ్మేశారా?
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:35 AM
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపింది.
న్యూఢిల్లీ: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపింది. అయితే, ఆ డీల్కు సంబంధించిన సమాచారం అధికారికంగా ఇంత వరకు బయటకు రాలేదు. కానీ, ముంబై రూ. 100 కోట్లకు పాండ్యాను ఖరీదు చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం ట్రాన్స్ఫర్ ఫీజు కింద గుజరాత్ వంద కోట్ల రూపాయలను ఐపీఎల్ నుంచి పొందనుందని చెప్పుకొంటున్నారు. ఇంత భారీ లాభం వస్తుంది కాబట్టి హార్దిక్ను గుజరాత్ అమ్మేసిందని భావిస్తున్నారు. గుజరాత్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించే విధంగా ఈ సంస్థ పని చేస్తోంది.