తిరుమల ఆలయంలో పుష్పాలంకరణకు
ABN , First Publish Date - 2023-10-22T04:40:08+05:30 IST
నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం తిరుమల ఆలయంలో చేసిన పుష్పాలంకరణ కోసం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...
వీవీఎస్ విరాళం రూ.14 లక్షలు
తిరుమల (ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం తిరుమల ఆలయంలో చేసిన పుష్పాలంకరణ కోసం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రూ. 14 లక్షలు విరాళంగా అందజేశాడు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న వీవీఎస్.. రాత్రి జరిగిన చంద్రప్రభ వాహనసేవలో పాల్గొన్నాడు.