For Dutch and German junior tournaments : డచ్, జర్మన్ జూనియర్ టోర్నీలకు లోకేష్, శ్రేయాన్షి ఎంపిక
ABN , First Publish Date - 2023-02-07T03:00:12+05:30 IST
వచ్చే నెలలో జరిగే డచ్, జర్మన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొనే జట్లలో తెలంగాణకు చెందిన లోకేష్ రెడ్డికి చోటు దక్కింది.
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే డచ్, జర్మన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొనే జట్లలో తెలంగాణకు చెందిన లోకేష్ రెడ్డికి చోటు దక్కింది. పురుషుల సింగిల్స్లో లోకేష్ ఆడనున్నాడు. మహిళల డబుల్స్లో ఆంధ్రా-తెలంగాణ జంట వెన్నెల శ్రీ-శ్రేయాన్షి వలిశెట్టి, మిక్స్డ్లో తెలంగాణకు చెందిన సాత్విక్ రెడ్డి-వైష్ణవి ఖడ్కేకర్ జంటలు ఎంపికయ్యాయి. మార్చి 1 నుంచి డచ్ జూనియర్ టోర్నీ, 8 నుంచి బెర్లిన్లో జర్మన్ జూనియర్ టోర్నీ జరగనున్నాయి. గతనెలలో నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో ప్రతిభ కనబర్చిన 19 మందిని ఎంపిక చేసినట్టు బాయ్ పేర్కొంది.