India T20 with England : ఇంగ్లండ్ బోణీ
ABN , First Publish Date - 2023-12-07T04:27:34+05:30 IST
నటాలియా స్కివర్ బ్రంట్ (53 బంతుల్లో 13 ఫోర్లతో 77), డేనియల్ వయట్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 75) ధనాధన్ అర్ధ శతకాలతో అదరగొట్టడంతో.. మూడు టీ20ల ..
![India T20 with England : ఇంగ్లండ్ బోణీ](https://media.andhrajyothy.com/media/2023/20231205/enh_877cef5ee7.jpg)
దుమ్మురేపిన బ్రంట్, వయట్
38 పరుగులతో ఓడిన భారత్
షఫాలీ శ్రమ వృథా
తొలి టీ20
ముంబై: నటాలియా స్కివర్ బ్రంట్ (53 బంతుల్లో 13 ఫోర్లతో 77), డేనియల్ వయట్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 75) ధనాధన్ అర్ధ శతకాలతో అదరగొట్టడంతో.. మూడు టీ20ల సిరీ్సలో ఇంగ్లండ్ మహిళల జట్టు బోణీ చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ 38 పరుగుల తేడాతో ఆతిథ్య భారత్ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు చేసింది. రేణుక 3, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ ఓవర్లన్నీ ఆడి 159/6 స్కోరు మాత్రమే చేసింది. షఫాలీ వర్మ (42 బంతుల్లో 9 ఫోర్లతో 52) అర్ధ శతకం వృథా అయింది. ఎకెల్స్టోన్ 3 వికెట్లు దక్కించుకొంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా బ్రంట్ నిలిచింది. భారత్ తరఫున శ్రేయాంక, సైకా ఇషాక్ అరంగేట్రం చేశారు.
స్మృతి విఫలం..: భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ షఫాలీ మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఓపెనర్ స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కానీ, మరో ఓపెనర్ షఫాలీతో జత కలసిన కెప్టెన్ హర్మన్ప్రీత్ (26) మూడో వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేసింది. మొత్తంగా పవర్ప్లే ముగిసేసరికి భారత్ 53/2తో నిలిచింది. అయితే, స్కోరు జోరందుకొంటున్న సమయంలో హర్మన్ను ఎకెల్స్టోన్ బౌల్డ్ చేయడంతో భారత్ కష్టాల్లో పడింది. షఫాలీతో కలసి ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రిచా ఘోష్ (21)ను గ్లెన్ క్యాచవుట్ చేయడంతో.. నాలుగో వికెట్కు 40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఒంటరి పోరాటం చేసిన వర్మ సింగిల్తో అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. 15వ ఓవర్లకు భారత్ 124/4తో నిలిచింది. చివరి 5 ఓవర్లలో విజయానికి 74 పరుగులు కావాల్సిన సమయంలో షఫాలీని ఎకెల్స్టోన్ పెవిలియన్ చేర్చడంతో టీమిండియా ఓటమి లాంఛనమే అయింది.
తడబడి.. నిలబడి..: తొలి ఓవర్లోనే ఓపెనర్ సోఫియా డంక్లీ (1)తోపాటు క్యాప్సీ (0)ను వరుస బంతుల్లోనే అవుట్ చేసిన రేణుక.. ఇంగ్లండ్కు గట్టి షాకిచ్చింది. కానీ, మరో ఓపెనర్ నటాలియా-వయట్ మూడో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యంతో సవాల్ విసరగలిగే స్కోరును అందించారు. పవర్ప్లేలో వీరిద్దరూ నిలకడగా ఆడడంతో ఇంగ్లండ్ 44/2 స్కోరు చేసింది. వస్త్రాకర్ వేసిన ఏడో ఓవర్లో స్కివర్ రెండు బౌండ్రీలతో గేర్ మార్చగా.. ఆ తర్వాతి ఓవర్లో సైకా బౌలింగ్లో వయట్ రెండు ఫోర్లు బాదింది. కాగా, 12వ ఓవర్లో శ్రేయాంక బౌలింగ్లో రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్న వయట్.. సిక్స్తో ఫిఫ్టీ పూర్తి చేసుకొంది. మరోవైపు స్కివర్ కూడా ఫోర్తో హాఫ్ సెంచరీ సాధించింది. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 149/2 స్కోరు చేసింది. అయితే, ఇషాక్ బౌలింగ్లో వయట్ స్టంపౌట్ అయింది. కానీ, జోరు తగ్గించని బ్రంట్.. వస్త్రాకర్ వేసిన 17వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో 19 పరుగులు రాబట్టింది. కెప్టెన్ నైట్ (6)ను శ్రేయాంక బౌల్డ్ చేయగా.. ధాటిగా ఆడుతున్న బ్రంట్ను రేణుక వెనక్కిపంపింది. ఆఖరి ఓవర్లో అమీ జోన్స్ (23) సిక్స్, రెండు ఫోర్లతో జోరు చూపించడంతో.. ఇంగ్లండ్ స్కోరు 200 మార్క్కు చేరువైంది.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్: సోఫియా (బి) రేణుక 1, వయట్ (స్టంప్) ఘోష్ (బి) ఇషాక్ 75, క్యాప్సీ (బి) రేణుక 0, స్కివర్ బ్రంట్(సి) ఘోష్ (బి) రేణుక 75, హీథర్నైట్ (బి) శ్రేయాంక 6, అమీ జోన్స్ (సి) జెమీమా (బి) శ్రేయాంక 23, కెంప్ (నాటౌట్) 5, ఎక్స్ట్రాలు 10, మొత్తం: 20 ఓవర్లలో 197/6, వికెట్లపతనం: 1-2, 2-2, 3-140, 4-165, 5-177, 6-197; బౌలింగ్: రేణుక సింగ్ 4-0-27-3, పూజా వస్ర్తాకర్ 4-0-44-0, ఇషాక్ 4-0-38-1, దీప్తీ శర్మ 3-0-28-0, శ్రేయాంక పాటిల్ 4-0-44-2, కనిక 1-0-12-0.
భారత్: షఫాలీ (సి) గ్లెన్ (బి) ఎకెల్స్టోన్ 52, మంధాన (బి) స్కివర్ బ్రంట్ 6, జెమీమా (సి) జోన్స్ (బి) కెంప్ 4, హర్మన్ప్రీత్ (బి) ఎకెల్స్టోన్ 26, రిచా ఘోష్ (సి) క్యాప్సీ (బి) గ్లెన్ 21, కనిక (సి) స్కివర్ బ్రంట్ (బి) ఎకెల్స్టోన్ 15, పూజా వస్ర్తాకర్ (నాటౌట్) 11, దీప్తీ శర్మ (నాటౌట్) 3, ఎక్స్ట్రాలు 21, మొత్తం: 20 ఓవర్లలో 159/6; వికెట్లపతనం : 1-20, 2-41, 3-82, 4-122, 5-134, 6-151; బౌలింగ్: మహికా గోర్ 2-0-18-0, లారెల్ బెల్ 4-0-35-0, స్కివర్ బ్రంట్ 4-0-35-1, కెంప్ 2-0-31-1, ఎకెల్స్టోన్ 4-0-15-3, గ్లెన్ 4-0-25-1.