Share News

నేటి నుంచి చైనా మాస్టర్స్‌

ABN , First Publish Date - 2023-11-21T02:23:56+05:30 IST

ఈ ఏడాది చివరి బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 750 సిరీస్‌.. చైనా మాస్టర్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారత షట్లర్లు సిద్ధమవుతున్నారు...

నేటి నుంచి చైనా మాస్టర్స్‌

బరిలో ప్రణయ్‌, సేన్‌, శ్రీకాంత్‌, సాత్విక్‌ జోడీ

షెన్‌జెన్‌: ఈ ఏడాది చివరి బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 750 సిరీస్‌.. చైనా మాస్టర్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారత షట్లర్లు సిద్ధమవుతున్నారు. మంగళవారం ప్రారంభమవుతున్న ఈ టోర్నీలో టాప్‌ షట్లర్లు హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, లక్ష్యసేన్‌తో పాటు తెలుగు షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌-చిరాగ్‌ జోడీ బరిలోకి దిగుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లోపు ప్రపంచ టాప్‌-16లో ఉండే వారికే ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత లభించనుండడంతో ఇక్కడ నుంచి ఆడబోయే ప్రతి టోర్నీ లక్ష్యసేన్‌ (17వ ర్యాంక్‌), శ్రీకాంత్‌ (23వ ర్యాంక్‌) కు చాలా ముఖ్యమైనది. వీరితో పాటు పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్‌, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌, డబుల్స్‌లో రుతుపర్ణ-శ్వేతపర్ణ జోడీ బరిలోకి దిగుతున్నారు.

Updated Date - 2023-11-21T02:23:57+05:30 IST