అఫ్ఘాన్ క్రికెట్ జట్టు మెంటార్గా అజయ్ జడేజా
ABN , First Publish Date - 2023-10-03T00:58:50+05:30 IST
భారత జట్టు మాజీ కెప్టెన్ అజయ్ జడేజాను అఫ్ఘానిస్థాన్ జట్టు మెంటార్గా నియమించారు...
న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ కెప్టెన్ అజయ్ జడేజాను అఫ్ఘానిస్థాన్ జట్టు మెంటార్గా నియమించారు. తాజా వన్డే వరల్డ్కప్లో అతడు ఈ బాధ్యతలు నెరవేరుస్తాడని అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) పేర్కొంది. ఇప్పటికే అతను జట్టులో చేరగా.. ఆటగాళ్లకు పలు సూచనలిస్తున్న ఫొటోలను ఏసీబీ విడుదల చేసింది.