Naresh: ఇంటిపై దుండగుల దాడి.. మూడో భార్యే చేయించిందంటూ..

ABN , First Publish Date - 2023-02-19T17:45:07+05:30 IST

సినీ నటుడు నరేష్‌ (Naresh) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నానక్‌రామ్‌గూడలోని ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన కారును దుండగులు ధ్వంసం చేశారు. దాడి నేపథ్యంలో ఆయన పీఏ కుమార్‌గౌడ్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Naresh: ఇంటిపై దుండగుల దాడి..  మూడో భార్యే చేయించిందంటూ..

సినీ నటుడు నరేష్‌ (Naresh) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నానక్‌రామ్‌గూడలోని ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన కారును దుండగులు ధ్వంసం చేశారు. దాడి నేపథ్యంలో ఆయన పీఏ కుమార్‌గౌడ్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయ టవర్స్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న నరేష్ కారవాన్‌పై రాయితో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని ఆయన పీఏ పేర్కొన్నారు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

నరేష్ మాత్రం తన మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) దాడి చేయించిందని ఆరోపించారు. నరేష్‌ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నరేష్ కొన్ని రోజుల క్రితమే తన మూడో భార్య రమ్య రఘుపతిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించారని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఇంటిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది.

Updated Date - 2023-02-19T17:47:23+05:30 IST