SS Rajamouli: ‘నేను మీలాగే అనుకుంటున్నా.. కొంచెం గ్యాప్ కావాలి’

ABN , First Publish Date - 2023-01-26T11:42:42+05:30 IST

టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani)ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రద్మశ్రీ(Padma Shri)తో సత్కరించింది.

SS Rajamouli: ‘నేను మీలాగే అనుకుంటున్నా.. కొంచెం గ్యాప్ కావాలి’
SS Rajamouli

టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani)ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రద్మశ్రీ(Padma Shri)తో సత్కరించింది. దీంతో ఆయనకి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విషయంపై ఆయన సోదరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సైతం స్పందించాడు. కీరవాణికి పద్మశ్రీ రావడం సంతోషంగా ఉందంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

రాజమౌళి షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘మీ అభిమానులలో చాలామంది భావిస్తున్నట్లుగా, ఈ గుర్తింపు చాలా కాలం క్రితమే రావాల్సింది. కానీ, మీరు చెప్పినట్లు విశ్వం ఒకరి ప్రయత్నాలకు కచ్చితంగా ప్రతిఫలం ఇస్తుంది. అది విచిత్రంగా ఉంటుంది. నాకు ఒకవేళ విశ్వంతో మాట్లాడే అవకాశం వస్తే.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకోటి ఇవ్వమని చెబుతా’ అని రాసుకొచ్చాడు.

అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ పాటని ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. అంతేకాకుండా.. తాజాగా ప్రకటించిన ఆస్కార్ అవార్డు యాజమాన్యం ప్రకటించిన నామినేషన్‌ లిస్ట్‌లో ఈ పాటకి చోటు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్‌కి పోటీ పడుతుంది.

Updated Date - 2023-01-26T12:40:43+05:30 IST