SSMB28: మహేశ్ బాబుకి విలన్ ఫిక్స్!

ABN , First Publish Date - 2023-02-13T15:37:21+05:30 IST

టాలీవుడ్‌లోని సూపర్ స్టార్స్‌లో మహేశ్ బాబు (Mahesh Babu) ఒకరు. చివరగా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) లో కనిపించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

SSMB28: మహేశ్ బాబుకి విలన్ ఫిక్స్!

టాలీవుడ్‌లోని సూపర్ స్టార్స్‌లో మహేశ్ బాబు (Mahesh Babu) ఒకరు. చివరగా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) లో కనిపించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ (SSMB28) అని వ్యవహరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. ఈ ప్రాజెక్టులో విలన్‌ ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతుంది.

Jagapathi-Babu.gif

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ లో జగపతి బాబు (Jagapathi Babu) ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. మహేశ్‌తో తలపడనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం అందుతుంది. గతంలో మహేశ్ బాబు, జగ్గూ భాయ్ కలసి ‘శ్రీమంతుడు’ లో నటించారు. ఆ చిత్రంలో తండ్రి, కుమారులుగా కనిపించారు. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ లో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల (Sreeleela) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను షూటింగ్ ప్రారంభానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిజిటల్ రైట్స్ కోసం దాదాపుగా రూ.81కోట్లు చెల్లించిందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అందుకోసం రూ.10కోట్లతో భారీస్థాయిలో ఇంటి సెట్‌ను వేస్తున్నారు. ‘ఖలేజా’ తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలసి సినిమా చేస్తుండంటంతో ప్రాజెక్టుపై భారీ బజ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది.

Updated Date - 2023-02-13T15:37:22+05:30 IST