Kalatapaswi: కె.విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూత.. 24 రోజుల వ్యవధిలో దంపతుల తుదిశ్వాస

ABN , First Publish Date - 2023-02-26T20:03:53+05:30 IST

దివంగత కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ భార్య జయలక్ష్మి (88)కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.

Kalatapaswi: కె.విశ్వనాథ్‌  సతీమణి జయలక్ష్మి కన్నుమూత.. 24 రోజుల వ్యవధిలో దంపతుల తుదిశ్వాస

దివంగత కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ (K viswanath) ,భార్య జయలక్ష్మి (Jaya Lakshmi) (88)కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు(Jaya Lakshmi passes away). చికిత్స పొందుతూ నిద్రలోనే కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల రెండో తేదిన కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ కన్ను మూసిన సంగతి తెలిసిందే! అప్పటికే జయలక్ష్మి మంచానికే పరిమితమై ఉన్నారు. కె.విశ్వనాథ్‌- జయలక్ష్మి దంపతులు పెద్ద కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తదుపరి అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసింది.

Updated Date - 2023-02-26T20:08:36+05:30 IST