Samantha : అప్పుడు భయపడితే... ఇప్పుడు బాధ పడేదాన్ని!
ABN , First Publish Date - 2023-03-26T01:19:18+05:30 IST
‘‘జీవితంలో కష్టాలు, బాధలు వస్తుంటాయి. అలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. ఆ సమయంలో తీసుకొనే కొన్ని నిర్ణయాల వల్ల మనం మరింత ఇబ్బందుల్లో పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడే ఓపిక, సహనం, ముందు చూపు మ
‘‘జీవితంలో కష్టాలు, బాధలు వస్తుంటాయి. అలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. ఆ సమయంలో తీసుకొనే కొన్ని నిర్ణయాల వల్ల మనం మరింత ఇబ్బందుల్లో పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడే ఓపిక, సహనం, ముందు చూపు మరింత అవసరం’’ అంటోంది సమంత. తను ఇటీవల మయోసైటిస్ వ్యాధి బారీన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది. తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని, ఇది వరకటి కంటే నయమని, త్వరలోనే పూర్తిగా మెరుగుపడుతుందనే ధీమా వ్యక్తం చేసింది సమంత. ‘‘యశోద సమయంలో చాలా ఇబ్బంది పడ్డా. ప్రమోషన్లకు కూడా శరీరం సహకరించేది కాదు. ‘శాకుంతలం’ కథ చెప్పేటప్పుడు నేను చేయగలనా? అనే భయం వేసింది. ‘నో’ చెబుదాం అనుకొన్నా. నిజంగా అప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకొని, ‘శాకుంతలం’ వదిలేసి ఉంటే ఇప్పుడు చాలా బాధ పడేదాన్ని. కొన్ని కష్టనష్టాల్ని ఓర్చుకోవడం వల్లే.. ‘శాకుంతలం’ లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చింది. ఇది నా కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్’’ అంటోంది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది.