Akshay's movie : ఆస్కార్ బరిలో అక్షయ్ సినిమా
ABN , First Publish Date - 2023-10-14T23:25:24+05:30 IST
అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణీగంజ్’ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని ఆస్కార్ కోసం పోటీలో నిలిపింది చిత్రబృందం. జనరల్
అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణీగంజ్’ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని ఆస్కార్ కోసం పోటీలో నిలిపింది చిత్రబృందం. జనరల్ కేటగిరీలో ప్రైవేటు నామినేషన్ ద్వారా ఈ చిత్రాన్ని ఆస్కార్కు పంపుతున్నారు. టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. బాక్సాఫీసు పరంగా సంతృప్తికరమైన ఫలితం రానప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. రాణీగంజ్లోని కోల్ ఫీల్డ్లో 65మంది మైనర్లను రక్షించిన కమాండో జశ్వంత్ సింగ్ గిల్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈయేడాది ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ కోసం ‘మిషన్ రాణీ గంజ్’ కూడా పోటీ పడింది. అయితే ఆ అవకాశం మలయాళ చిత్రం ‘2018’కి దక్కింది. దాంతో... ప్రెవేటు ఎంట్రీగా ‘మిషన్ రాణీగంజ్’ని ఆస్కార్కి పంపుతున్నారు. గతేడాది కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ ఇలానే ప్రైవేటు ఎంట్రీగా వెళ్లి ఆస్కార్ పట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.